చెన్నై:
తమిళనాడు రాజధాని చెన్నైలోని పోయెస్ గార్డెన్లో కాంగ్రెసు రాజ్యసభ
సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత
నివాసంపై ఆదాయం పన్ను శాఖ
అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐటి
అధికారులు కీలక పత్రాలను స్వాధీనం
చేసుకున్నట్లు తెలుస్తోంది.
సుస్మిత
పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సుస్మిత
నివాసంలో ఐటి అధికారులు భారీగా
నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు
తెలుస్తోంది. ఆదాయం పన్ను ఎగవేశారనే
సమాచారంతోనే సుస్మిత నివాసంపై ఐటి శాఖ అధికారులు
ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 12 మంది అధికారులతో కూడిన
బృందం సుస్మిత నివాసంలో సోదాలు జరిపింది. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ను ఐటి అధికారులు
విచారిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవికి
ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుస్మిత
కాగా, చిన్న కూతురు శ్రీజ.
చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.
తన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన ఉప ఎన్నికల్లో
కాంగ్రెసు అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం
నిర్వహిస్తున్నారు.
0 comments:
Post a Comment