బాలీవుడ్
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్
ఖాన్ ఆటో డ్రైవర్కు
ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తన
ప్రత్యేకతను చాటుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్, సూర్
స్టార్ అంటే కేవలం సక్సెస్ఫుల్ సినిమాలు తీయడమే
కాదు మనల్ని ఈ స్థాయికి తెచ్చిన
అభిమానుల కోసం ఏం చేయడానికికైనా
సిద్ధపడాలని, ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని చాటిచెప్పాడు.
అమీర్
ఖాన్ తాను నటించిన ‘3 ఇడియట్స్’ ప్రమోషన్లో
పాల్గొన్నప్పుడు ఆటో డ్రైవర్ రామ్
లఖాన్ పాశ్వాన్కి ప్రామిస్ చేశాడు.
ఆ ప్రామిస్ మేరకు ఆ ఆటో
డ్రైవర్ కొడుకు పెళ్లికి హాజరైన నూతన వధూవరులు రాజీవ్,
వేధితలకు శుభాకాంక్షలు తెలిపాడు. అమీర్ను చూసేందుకు
జనం ఎగబడ్డారు. అక్కడ ఆయన దాదాపు
గంట పాటు గడిపారు.
ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ....తాను
సినిమానో, టీవీ షోను ప్రమోట్
చేసుకోవడానికి ఇక్కడకు రాలేదని, తన స్నేహితుడు రామ్
లఖాన్ పాశ్వాన్ ఇంట్లో శుభకార్యానికి వచ్చానని అమీర్ ఖాన్ స్పష్టం
చేశాడు. 3 ఇడియట్స్ సినిమా ప్రమోషన్ సమయంలోనే రామ్ లఖాన్ పాశ్వాన్
తనకు చాలా సన్నిహితుడయ్యాడని అమీర్
ఖాన్ చెప్పుకొచ్చారు.
పై పెళ్లి విషయం పక్కన పెడితే....అమీర్ కంట ఇటీవల
కన్నీరొలికింది. సామాన్య ప్రజల కష్టాల్ని తెలుసుకున్న
ఈ బాలీవుడ్ స్టార్హీరో దుఃఖాన్ని అపుకోలేకపోయాడట.
వివరాల్లోకి వెళితే...‘సత్యమేవజయతే’
పేరుతో రూపొందుతున్న ఓ టీవీషోకు అమీర్
ప్రయోక్తగా వ్యవహరిసున్నారు. వివిధ జీవన స్రవంతుల్లో
సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాల్ని ప్రేక్షకులకు తెలియజెప్పే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్షికమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో
భాగంగా అమీర్ కార్యక్రమంలో పాల్గొన్న
చాలా మంది సమస్యల్ని అడిగి
తెలుకున్నాడట. మహిళల పట్ల వివక్ష,
లైంగిక వేధింపులు లాంటి సమస్యలు విన్నప్పుడు
అమీర్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడట. ‘అమీర్ ఎంత సున్నిత
మనస్కుడో మాకు అర్థమయింది. ఓ
స్టార్లా కాకుండా కుటుంబ
సభ్యుడిలా అందరి సమస్యల్ని ఓపిగ్గా
విన్నారు అమీర్. ముఖ్యంగా మహిళలు తమ పట్ల జరిగిన
అన్యాయాల్ని గురించి చెబుతున్నప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక
ఏడ్చేశాడు’ అని
కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
0 comments:
Post a Comment