మోహన్
బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రావణ’ చిత్రంపై ఇటీవల
రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం కోసం మోహన్ బాబు
సరసన నటింపజేసేందుకు ఆయన తనయుడు విష్ణు
శ్రీదేవిని సంప్రదించాడని, అయితే ఆమె కోటిన్నర
రెమ్యూనరేషన్ అడగటంతో విష్ణు ఆ ప్రయత్నం విరమించుకున్నారని
గాసిప్స్ వెలువడ్డాయి.
నిన్నటికి
నిన్న....హీరోయిన్ శ్రియ ఈ చిత్రంలో
అప్పర పాత్రలో నటించబోతోందని, ఇందులో ఆమె పాత్ర నెగెటివ్గా ఉంటుందని ప్రచారం
జరుగుతోందని పాఠకులకు ఇప్పటికే తెలియజేశాం. అయితే ఈ వార్తలను
మోహన్ బాబు తాజాగా ఖండించారు.
రావణ
చిత్రం కోసం తాము ఇప్పటి
వరకు ఎవరినీ సంప్రదించ లేదని....శ్రీదేవిని, శ్రియను సంప్రదించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ చిత్రాన్ని విష్ణు
ప్రొడ్యూష్ చేస్తున్నాడు. త్వరలోనే ఈచిత్రం నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియజేస్తాం
అన్నారు.
ఈ సినిమాలో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి పెద్ద పీట
వేయనున్నట్టు మోహన్ బాబు చెప్పారు.
గతంలోఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానుభావులు రావణాసురుడి
పాత్రను పోషించి మెప్పించారనీ ... తనదైన శైలిలో ఈ
పాత్రను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తానని
అన్నారు. అధునాతనమైన 3 డి పరిజ్ఞానంతో తెరకెక్కనున్న
ఈ సినిమాలో, భారతీయ సినీపరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా నటిస్తారని చెప్పారు. గతంలో రాఘవేంద్ర రావు
- మోహన్ బాబు కాంబినేషన్ లో
ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి.
ఈ సినిమా కూడా ఆ స్థాయి
విజయాన్ని అందుకుంటుందనీ ... 'రావణ'గా మోహన్
బాబు తన విశ్వ రూపాన్ని
చూపించడం ఖాయమని టాలీవుడ్ సినీజనాలు అనుకుంటున్నారు.
0 comments:
Post a Comment