మ్యూజిక్
పైరసీకి వ్యతిరేకంగా సాగే యాంటీ పైరసీ
కార్యక్రమాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మంచు
లక్ష్మి గురువారం లాంచ్ చేశారు. బిగ్
ఎఫ్ఎం, ఆన్ లైన్
మ్యూజిక్ పోర్టల్ రాగా వెబ్ సైట్,
ఆదిత్యా మ్యూజిక్, భారతి సిమెంట్, ప్రసాద్
ఐమాక్స్ తదితర సంస్థలు ఈకార్యక్రమాన్ని
సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా వక్తలు
మాట్లాడుతూ...మ్యూజిక్ పైరసీని ఆరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒరిజినల్
మ్యూజిక్ను గెలిపించాలని, లైఫ్
అందించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని బిగ్
ఎఫ్ఎం విస్తృతంగా పచారం
చేయనుంది. ప్రసాద్ ఐమాక్స్లో శుక్రవారం జరిగిన
ఈ కార్యక్రమంలో దిల్ రాజు, మంచు
లక్ష్మితో పాటు ప్రముఖ సింగర్
హేమచంద్ర పాల్గొన్నారు.
ప్రస్తుతం
దిల్ రాజు వెంకటేష్, మహేష్
బాబు మల్టీ స్టారర్గా
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’,
రామ్ చరణ్ హీరోగా వంశీ
పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్లో విడుదలైన
రచ్చ, దమ్ము చిత్రాల డిస్ట్రిబ్యూషన్
హక్కులతో పాటు గబ్బర్ సింగ్
చిత్రం హక్కులను దక్కించుకుని దిల్ రాజు తన
హవా కొనసాగిస్తున్నారు.
మంచు
లక్ష్మి రామ్ గోపాల్ వర్మ
దర్శకత్వంలో ‘డిపార్ట్ మెంట్’ చిత్రంతో పాటు, గుండెల్లో గోదావరి,
మణిరత్నం దర్శకత్వంలో కడల్, మరో తమిళ
సినిమాలో నటిస్తోంది. మంచు లక్ష్మి నిర్మాతగా
వ్యవహరిస్తున్న ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.
0 comments:
Post a Comment