నేను
ఏ సినిమా చేసినా ఒక విషయం ఆలోచిస్తాను.
ఇందులో నా అభిమానులు ఆనందపడే
విషయాలు ఏమున్నాయా? అని. ఏం చేసినా
వాళ్లకు నచ్చాలి అన్నదే నా సిద్ధాంతం అన్నారు.
ఆయన తాజా చిత్రం బాద్షా
గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఈ
రోజు ఆయన పుట్టిన రోజు
సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. శ్రీను
వైట్ల దర్శకత్వంలో 'బాద్షా' రూపొందబోతోంది.
బండ్ల గణేష్ నిర్మాత.
ఇటీవలే
ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రం చేశారు. 'అదుర్స్' అంటూ ఇంటిల్లిపాదినీ కడుపుబ్బ
నవ్వించారు. 'బృందావనం', తాజాగా 'దమ్ము'తో కుటుంబకథా
చిత్రాలకు ఈ హీరో చాలా
బాగా సరిపోతాడనిపించారు. 'దమ్ము'లో ఆయన
చేసిన 'రూలర్' పాట కు మంచి
క్రేజ్ వచ్చింది.త్వరలో 'బాద్షా' సినిమా
చిత్రీకరణలో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు.
ఆదివారం ఎన్టీఆర్ జన్మదినం. ఇక చిత్రం గురించి
ఎన్టీఆర్ మాట్లాడుతూ ''వినోద ప్రధానం ఉండే
కథ ఇది. ప్రతి సన్నివేశం
కడుపుబ్బ నవ్వుకొనేలా తీర్చిదిద్దుతున్నారు శ్రీను అన్నారు.
అలాగే
అదుర్స్, బృందావనం, దమ్ము... ఇలా ఎప్పటికప్పుడు విభిన్నమైన
కథలు చేస్తున్నాను. ఇందుకు అభిమానులు ఇస్తున్న ప్రోత్సాహమే కారణం. నా దృష్టి అంతా
నటన మీదే కేంద్రీకరిస్తున్నాను. ఎంపిక చేసుకొనే
పాత్రల్లో భిన్నమైన కోణాలు ఉండాలి. తద్వారా అందర్నీ అలరించేలా నటించేందుకు వీలు చిక్కుతుంది''అని
చెప్పుకొచ్చారు.
నేను
ఏ సినిమా చేసినా ముందు గుర్తుంచుకునేది అభిమానులనే.
వారి ఆత్మసంతృప్తినే. మాస్ను మెప్పించాలన్నదే
నా ధ్యేయం. అందుకే యాక్షన్ బాటలోనుంతి కెరీర్ బండిని వైవిధ్యత కోసం రూటు తిప్పా
అంటున్నారు. 'యమదొంగ'లాంటి సోషియో ఫాంటసీ
చిత్రంతో మెప్పించారు. చారిత్రక సినిమాల్లోనూ సూపర్ అనిపించుకునే సత్తా
ఉన్న ఎన్టీఆర్ కి పుట్టిన రోజు
శుభాకాంక్షలు ధట్స్ తెలుగు తెలియచేస్తోంది.
0 comments:
Post a Comment