హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు సోమవారం
మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓ సామాజిక వర్గాన్ని
మచ్చిక చేసుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డిని
ముఖ్యమంత్రిని చేశారని ఆయన వ్యాఖ్యానిచారు. కులం
కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డికి
ముఖ్యమంత్రి పదవి దక్కిందని ఆయన
అన్నారు. కాంగ్రెసు పార్టీ కులతత్వం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. పార్టీకి
దూరమవుతున్న ఓ సామాజిక వర్గానికి
దగ్గరయ్యేందుకు కాంగ్రెసు పార్టీ కిరణ్ కుమార్ రెడ్డిని
ముఖ్యమంత్రిని చేసిందని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలను
అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ
ఆత్మగౌరవ పోరాటాన్ని అర్థం చేసుకునే స్థాయి
ముఖ్యమంత్రికి లేదని ఆయన తప్పు
పట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి
సహా కాంగ్రెసు నాయకులు మతిలేని, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన
వ్యాఖ్యానించారు. పరకాల ప్రజలే కాకుండా
కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకృతి కూడా ఛీకొట్టిందని ఆయన
అన్నారు.
మతతత్వం
గురించి మాట్లాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి
మద్దతు కోసం మజ్లీస్ పార్టీతో
అంట కాగుతున్నారని ఆయన అన్నారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తిరుమల
పర్యటనను కూడా ముఖ్యమంత్రి వక్రీకరించారని
ఆయన అన్నారు. సోనియా అతి పెద్ద క్రిస్టియన్
అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలకు అర్థమేమిటని
ఆయన అడిగారు.
ఏడాది
పాలన తర్వాత కూడా ఉప ఎన్నికలు
రెఫరెండం కాదని ముఖ్యమంత్రి నీతిలేని
మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సొంత
జిల్లాలోని తిరుపతి సీటు అయినా గెలిపించుకోగలరా
అని ఆయన ముఖ్యమంత్రిని సవాల్
చేశారు. కాంగ్రెసు ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి
రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
శాసనసభ్యులకు
రూ. 25 లక్షలేసి, పార్చులర్ కార్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నారని ఆయన కిరణ్ కుమార్
రెడ్డిపై ధ్వజమెత్తారు. కేసుల పేరుతో మంత్రులను
బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తద్వారా మంత్రులతో తనకు అనుకూలంగా మాట్లాడించుకుంటున్నారని
ఆయన అన్నారు.
0 comments:
Post a Comment