ఒంగోలు:
ప్రకాశం జిల్లా చీరాల శాసన సభ్యుడు
ఆమంచి కృష్ణ మోహన్ తనను
అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వెంకాయమ్మ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సెల్ టవర్ ఎక్కి
రెండు గంటల పాటు అందరినీ
పరుగులు పెట్టించారు. ఇటీవల ఉప ఎన్నికల
ప్రచారం కోసం ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి చీరాల వచ్చారు.
ఆ సమయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు తాను ఒంగోలు పార్లమెంటు
సభ్యులు కార్యాలయానికి వెళ్లానని, అయితే తనను ఎమ్మెల్యే
ఆమంచి అడ్డుకొని కొట్టాడని ఆమె ఆరోపించారు. పోలీసుల
సమక్షంలోనే ఇది జరిగిందని ఆమె
ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు కూడా
ఫిర్యాదు చేశారు.
అయితే
తాను ఫిర్యాదు చేసి మూడు రోజులు
అయినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తూ ఆమె సెల్ టవర్
ఎక్కి హంగామా చేశారు. తనకు న్యాయం చేయాలని
ఆమె విజ్ఞప్తి చేశారు. చివరకు పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని
హామీ ఇవ్వడంతో ఆమె సెల్ టవర్
పై నుండి కిందకు దిగి
వచ్చారు. దాంతో అక్కడి వారు
అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కాగా
ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రకాశం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన
పార్టీ నాయకులతో సమావేశమై ఉప ఎన్నికలలో పార్టీ
గెలుపుపై దిశా నిర్దేశనం చేశారు.
0 comments:
Post a Comment