పవన్
కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.
దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ
చిత్రాన్ని తెలుగు,హిందీ భాషల్లో చేద్దామని
పవన్ పై పూరీ జగన్నాధ్
ప్రెజర్ తెస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. తనకు
అమితాబ్ చేసిన బుడ్డా చిత్రంలో
హిందీలో మార్కెట్ ఏర్పడింది కాబట్టి రెండు భాషల్లోనూ చేస్తే
బెస్ట్ అన్నట్లుగా చెప్పి ఒప్పించే ప్రయత్నం పూరీ చేస్తున్నారట. అంతేగాక
గబ్బర్ సింగ్ ని అక్కడ
హిట్ అయిన దబాంగ్ రీమేక్
చేసి హిట్ కొట్టడంతో బాలీవుడ్
లోనూ క్రేజ్ వచ్చిందని, కాబట్టి రెండు బాషల్లో చేయటం
ఉత్తమమని చెప్తున్నాడని వినికిడి. అయితే పవన్ కళ్యాణ్
ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని
చెప్తున్నారు.
'కెమెరామేన్
గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు
ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన
పూర్తి స్క్రిప్టును దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్
కళ్యాణ్కు వినిపించాడు. కథ
మొత్తం వినగానే పవన్ ఎంతగానో ఉద్వేగానికి
లోనయ్యాడట. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు
గర్వపడుతున్నానని పవన్ కామెంట్ చేసినట్టు
చెబుతున్నారు.ఆ కామెంట్తో
ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్కు
అసలు నిద్ర పట్టడం లేదట.
అలాగే
'గబ్బర్ సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్ గంగతో
రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేసే
గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.
ఇదంతా వీడియోగా తీసి పూరీ..యూ
ట్యూబ్ లో పెట్టాడు. తమన్నా
హీరోయిన్గా నటించే ఈ
చిత్రం షూటింగ్ జూన్ 9న ప్రారంభం కానుంది.
వచ్చే అక్టోబర్ 18న దీనిని విడుదల
చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్
చేశాడు.
ఇక ఈ చిత్రంకు పనిచేసే
నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు:
బ్యానర్:
యూనివర్సల్ మీడియా
నటీనటులు:
పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్
రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల
భరణి తదితరులు.
సంగీతం:
దేవిశ్రీ ప్రసాద్
ఫొటోగ్రఫీ:
శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్
డిజైనర్: చిన్నా
ఎడిటింగ్:
ఎ, ఆప్, శేఖర్
ఫైట్స్:
విజయ్
నిర్మాత:
డివివి దానయ్య
సమర్పణ:
సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం:
పూరి జగన్నాథ్.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్
మీడియా జర్నలిస్టు గా కనిపిస్తారు.
0 comments:
Post a Comment