న్యూఢిల్లీ:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ఆస్తులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శానససభ్యురాలు వైయస్ విజయమ్మ పిటిషన్
దాఖలు చేశారు. చంద్రబాబు సహా 17 మంది ఆస్తులపై విచారణ
జరపాలని ఆమె ఆ పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు.
చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలని తాను వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడాన్ని
ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
గతంలో
విజయమ్మ వేసిన పిటిషన్పై
చంద్రబాబు, తదితరుల ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది.
అయితే, దీనిపై కొంత మంది సుప్రీంకోర్టుకు
వెళ్లారు. తమకు నోటీసులు ఇవ్వకుండా
విచారణకు ఆదేశించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని
వారు వాదించారు. అయితే, ఈ విషయాన్ని హైకోర్టులోనే
తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వాళ్లు హైకోర్టులో
ఆ విషయంపై పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ
సాగించిన తర్వాత చంద్రబాబు, తదితరుల ఆస్తులపై విచారణ జరిపించాలనే వైయస్ విజయమ్మ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.
ప్రజా ప్రయోజనం కాదని, అందువల్ల కొట్టేస్తున్నామని వైయస్ విజయమ్మ వేసిన
పిటిషన్ను హైకోర్టు తెలిపింది.
హైకోర్టు
తమ పిటిషన్ను తోసిపుచ్చడాన్ని విజయమ్మ
శుక్రవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వైయస్
విజయమ్మ గతంలో వేసిన పిటిషన్లో ఈనాడు అధినేత
రామోజీరావు పేరుతో పాటు తెలుగుదేశం పార్టీ
నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. చంద్రబాబు
ప్రభుత్వ హయాంలో సుజనా చౌదరి, సిఎం
రమేష్ వంటివారు ప్రయోజనాలు పొందారని, ఇందులో అధికార దుర్వినియోగం జరిగిందని వైయస్ విజయమ్మ ఆరోపించారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కూడా అవే
పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment