న్యూఢిల్లీ:
తెలంగాణ ప్రాంత అధికార కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ వేటుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్
నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ
సీనియర్ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు
భిన్నంగా స్పందించారు. సస్పెన్షన్ వేటుపై వారు మంగళవారం న్యూఢిల్లీలో
మీడియాతో మాట్లాడారు.
కేంద్ర
ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణపై ఇచ్చిన
హామీని నెరవేర్చకుండా సొంత పార్టీ సభ్యులను
సభ నుండి గెంటి వేయడం
అప్రజాస్వామికమని కెసిఆర్ మండిపడ్డారు. సొంత పార్టీ సభ్యులను
గెంటి వేసిన కాంగ్రెసును తెలంగాణ
ప్రజలు ఈ ప్రాంతం నుండి
గెంటి వేయడం ఖాయమని అన్నారు.
ఇచ్చిన
హామీపై, ప్రజాస్వామ్యయుతంగా అడుగుతున్న ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే పార్లమెంటును,
తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని
అవమానించినందుకు కాంగ్రెసు పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెసు
పార్టీ అధిష్టానం, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు తెలంగాణపై డ్రామా ఆడుతున్నారని నామా నాగేశ్వర రావు
ఆరోపించారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ నోటీసు ఇస్తే కాంగ్రెసు ఎంపీలను
సస్పెండ్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది
విడ్డూరమన్నారు. అధిష్టానం, ఎంపీల నాటకానికి ఇది
ఓ ఉదాహరణ అన్నారు. ప్రధాన సమస్యను పక్కదారి పట్టించేందుకే వారు ఇలా చేస్తున్నారని
విమర్శించారు.
0 comments:
Post a Comment