న్యూఢిల్లీ:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాసిన
లేఖపై ఎన్నికల కమిషన్ (సిఇసి) స్పందించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు
విషయంలో తాము జోక్యం చేసుకోలేమని
సిఇసి స్పష్టం చేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న
నేపథ్యంలో ప్రచారం కోసం వైయస్ జగన్
జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని
కోరుతూ సిఇసికి వైయస్ విజయమ్మ లేఖ
రాశారు. తమది ఎలా స్వయం
ప్రతిపత్తి గల సంస్థనో, సిబిఐ
కూడా స్వయం ప్రతిపత్తి గల
సంస్థ అని, అందువల్ల సిబిఐ
దర్యాప్తు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని
సిఇసి వైయస్ విజయమ్మకు రాసిన
లేఖకు ప్రతిస్పందనగా చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రజాస్వామ్య
పరిరక్షణకు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు స్వేచ్ఛగా,
నిజాయితీగా జరిగేందుకు తన కుమారుడిని విడుదల
చేయాలని సిబిఐకి సూచించాలని కోరుతూ వైయస్ విజయమ్మ ప్రధాన
ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎస్వై ఖురేషీకి
సోమవారం ఓ లేఖ రాశారు.
జూన్ 12వ తేదీన ఉప
ఎన్నికలు జరగాల్సిన స్థితిలో వైయస్ జగన్ను
కుట్రపూరితంగా సిబిఐ అరెస్టు చేసిందని,
పాలక కాంగ్రెసు పార్టీకి సహాయం చేసేందుకు జగన్
ఎన్నికలో ప్రచారంలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే ఈ అరెస్టు జరిగిందని
ఆమె ఖురేషీకి రాసిన లేఖలో ఆరోపించారు.
ఉప ఎన్నికల పోలింగుకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండగా ఈ నెల
27వ తేదీన జగన్ను
సిబిఐ అరెస్టు చేసిందని, ఈ విషయంలో సిఇసి
జోక్యం చేసుకోవాలని కోరుతున్నానని ఆమె అన్నారు. ఎఫ్ఐఆర్
దాఖలు చేసిన తర్వాత సిబిఐ
270 రోజుల పాటు వైయస్ జగన్కు సమన్లు ఇవ్వకుండా
ఉప ఎన్నికల తేదీలు దగ్గరపడిన సమయంలో ఇవ్వడంలోనే కుట్ర దాగి ఉందని
ఆమె అన్నారు.
రాష్ట్రంలోని
18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
జూన్ 12వ తేదీన ఉప
ఎన్నికలు జరుగుతున్నాయి. 18 శానససభా స్థానాల్లోనూ లోకసభ స్థానంలోనూ వైయస్సార్
కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తోంది. సిబిఐ
ముందు హాజరయ్యే వరకు వైయస్ జగన్
ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. సిబిఐ ముందు హాజరు
కావడానికే ఆయన హైదరాబాదు వచ్చారు.
0 comments:
Post a Comment