‘కందిరీగ’
హిట్ తర్వాత రామ్ హీరోగా
వస్తున్న చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’. రామ్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం
వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బేనర్పై స్రవంతి
రవికిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గతంలో మే 11వ
తదీన విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. తాజాగా ఈ
చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 25వ తేదీన గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు
చేస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్బెన్’
పేరుతో విడుదల చేయనున్నారు.
అబ్బాయి రాసిన
లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని
పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా
అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది....అనే కాన్సెప్టుతో ఈచిత్రం రూపొందిస్తున్నారు.
యువతరాన్ని వెంటాడే
ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్ఫుల్గా చిత్రీకరిస్తున్నారని,
జెనీవా స్విట్జర్లాండ్లలో షూట్ చేసిన పాటలు హైలెట్గా ఉంటాయని నిర్మాత తెలిపారు. రాధికా
ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం:
కరుణాకరన్







0 comments:
Post a Comment