వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
తిరుమలేశుడిని అగౌరవపరచడం వల్లనే తాజా కష్టాలను ఎదుర్కుంటున్నారనే
మాట వినిపిస్తోంది. ఈ మాట అన్నదెవరో
కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు.
వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్పై సంతకం పెట్టకుండా
జగన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఇతర మతస్థులు అటువంటి
డిక్లరేషన్ ఇవ్వడం చట్టబద్దమేమీ కాదు, గానీ సంప్రదాయం.
ఈ సంప్రదాయాన్ని జగన్ పాటించలేదు.
డిక్లరేషన్పై సంతకం చేయకపోవడం
వల్లనే వైయస్ జగన్ మీడియా
సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేశాడని అంటున్నారు.
ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవించాలని,
వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు
అన్నారు. జగన్ అనుచరులు తిరమలలో
వ్యవహరించిన తీరును కూడా ఆయన తప్పు
పట్టారు.
జగన్
అనుచరులు తిరుమల కొండపై రాజకీయ నినాదాలు చేశారని, ఇది అక్కడ నిషేధమని,
దాంతో జగన్ శ్రీ వెంకటేశ్వర
స్వామి ఆగ్రహానికి గురయ్యారని ఆయన అన్నారు. ఇది
నిజమే కావచ్చునని వైయస్ జగన్ అనుకుంటారా,
అనుకోకపోవచ్చు కూడా. ఖాతాల స్తంభనను
ఆయన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా, పత్రికా స్వేచ్ఛకు భంగకరంగా ఆయన అభివర్ణిస్తున్నారు.
సిబిఐ
దర్యాప్తు జగన్ ఆక్రమ సంపాదనపై
జరుగుతోందని, దానికీ పత్రికా స్వేచ్ఛకు సంబంధం లేదని గాలి ముద్దు
కృష్ణమ నాయుడు అన్నారు. సిబిఐ చర్యలను పత్రికా
స్వేచ్ఛకు భంగకరంగా చిత్రీకరించడాన్ని ఆయన తప్పు పట్టారు.
0 comments:
Post a Comment