మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన
‘రచ్చ’
చిత్రం రేపటి(మే 24)తో
విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 127 సెంటర్లలో ఈ చిత్రం 50 రోజులు
విజయవంతంగా రన్ అవుతోంది. ఈ
విషయమై ఈ చిత్ర పబ్లిసిస్ట్
శ్రీనివాస్ మాట్లాడుతూ రచ్చ రికార్డు స్తాయిలో
50 రోజులు పూర్తి చేసుకుందని, 2012 సంవత్సరంలో టాలీవుడ్లో 100 సెంటర్లకు పైగా 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
రచ్చ
చిత్రం కలెక్షన్ల గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఈచిత్రం విడుదలైన రోజు నుంచి ఇప్పటి
వరకు రూ. 45 కోట్ల షేర్ సాధించిందని
వెల్లడించారు. ఈచిత్రం ఇంత పెద్ద మెగా
హిట్గా నిలిచినందుకు చాలా
ఆనందంగా ఉందిన, అభిమానులు అంతా చాలా సంతోషంగా
ఉన్నారని వెల్లడించారు.
రామ్
చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి
సంపత్ నంది దర్శకత్వం వహించారు.
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్
బ్యానర్పై రూపొందిన ఈ
చిత్రానికి ఆర్.బి.చౌదరి
సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్,
ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్సాయి,
కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.
రచ్చ
చిత్రం సెంటర్లు ఏరియా వైజ్గా
నైజాం-
16
సీడెడ్-
38
నెల్లూరు-
09
కృష్ణ-
08
గుంటూరు-
13
వైజాగ్-
24
ఈస్ట్
గోదావరి- 1 1
వెస్ట్
గోదావరి- 08
టోటల్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 127 సెంటర్లు
0 comments:
Post a Comment