అయిపోయింది...
అంతా అయిపోంది.. ముందు నుండి ఊహిస్తున్నట్లుగానే
పెట్రోల్ ధర ఒక్కసారిగా భగ్గుమంది.
రూపాయి కాదు రెండు రూపాయిలు
కాదు ఏకంగా.. లీటర్ పెట్రోల్ ధరపై
రూ.7.50 పెంపును విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నానాటికి బలహీన పడుతున్న రూపాయి
కారణంగా చమురు దిగుమతి బిల్లు
పెరిగిపోవటం, గత కొద్ది నెలలుగా
పెట్రోల్ ధరలను పెంచకపోవడంతో ఆ
భారం కాస్తా తడిసి మోపెడైంది. ఇప్పుడు
ఆ భారాన్ని మొత్తాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపింది.
బలహీన
పడుతున్న రూపాయి విలువను పరిగణలోకి తీసుకుని తక్షణమే పెట్రోల్ ధరలను పెంచాల్సిన అవసరం
ఉందని చమురు శాఖా మంత్రి
ఎస్ జైపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. జూన్ 2010లో పెట్రోల్ ధరలపై
తమ నియంత్రణలు తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇటీవల జరిగిన ఐదు
రాష్ట్రాల కీలక అసెంబ్లీ ఎన్నికల
నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచవద్దని ప్రభుత్వం
చమురు కంపెనీలను కోరింది. దీంతో అప్పటి నుండి
చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచలేదు.
ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరను సబ్సిడి ధరకే
విక్రయిస్తుండటం, రూపాయి మారకపు విలువలో ఎంత మాత్రం మార్పు
రాకపోవడంతో ఇక చేసేదే ఏమీ
లేక పెట్రో భారంతో సాధారణ ప్రజల నడ్డి విరిచేందుకు
ప్రభుత్వం నడుం బిగించింది.
0 comments:
Post a Comment