బాలకృష్ణ
తాజా చిత్రం అధినాయకుడు ఆర్దిక ఇబ్బందుల వల్ల రిలీజ్ వాయిదా
పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే
నిన్న(బుధవారం)ల్యాబ్ వద్ద ఈ చిత్రం
సెటిల్ మెంట్ జరిగి విడుదలకు
రెడీ అయ్యినట్లు సమాచారం. ఈ సెటిల్ మెంట్
వెనక జగన్ ఉన్నట్లు ఫిల్మ్
సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే
ఓ ప్రముఖ రాజకీయవేత్త ఈ చిత్రం ధియోటికల్
రైట్స్ తీసుకున్నాడని చెప్తున్నారు కానీ ఎవరనేది మాత్రం
చెప్పటం లేదు. ఈ నేపధ్యంలో
జగన్ పేరు బయిటకు వచ్చింది.
జగన్..బాలకృష్ణకు అభిమాని కావటంతో ఈ టాక్ వచ్చిందని
చెప్తున్నారు.
రాజకీయంగా
ఎవరి ఎజెండాలు వారికి ఉన్నా జగన్ కి,
బాలకృష్ణకి మధ్య స్నేహం ఉందని
అదే అదినాయకుడు బయిట పడేయటానకి సాయిం
చేసిందని చెప్తున్నారు. గతంలోనూ క్లిష్ట పరిస్ధితుల్లో,బాలకృష్ణ కాల్పుల కేసులు సమయంలోనూ జగన్ దగ్గరుండి బయిటపడేసారని
చెప్పుకుంటూండటం తెలిసిందే. అయితే ఓ వర్గం
మాత్రం జగన్ తీసుకున్నాడటం రూమరే,రిలియన్స్ లాంటి పెద్ద సంస్దలు
ఫైనాన్స్ చేసిన ఈ చిత్రం
పూర్తి సెటిల్ మెంట్ ఎమ్.ఎల్
కుమార చౌదరి చేసుకున్నాడంటున్నారు.
అదినాయకుడు
సినిమా చాలా బాగా వచ్చిందని,
ముఖ్యంగా సెకండాఫ్ అందరికీ నచ్చే ఎమోషన్స్ తో
తయారైందని అంటున్నారు. ఇక బాలకృష్ణ అభిమానలుకు
మాత్రమే కాక అందరికీ నచ్చే
చిత్రం ఇది అంటున్నారు దర్శకుడు.
అలాగే... కథ గురించి దర్శకుడు
మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం
సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే
మా చిత్రం అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ
త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్చౌదరి
నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు
పాటలు సహా చిత్రీకరణ పూర్తి
చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు.‘అధినాయకుడు’ చిత్రాన్ని కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తు న్నారు.
ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన అన్ని పాటలు
చాలా అద్భుతంగా వచ్చా యని అంటున్నారు.
నవంబర్లో ఈ చిత్రం
ఆడియో విడుదల కాబోతుందని వినికిడి. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక
చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్
కమర్షియల్ మూవీగా ‘అధినాయకుడు’ రాబోతోంది.
దర్శకుడు
పరుచూరి మురళి ఈ చిత్రం
గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన
నేత, వారి కష్ట సుఖాలలో
పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో
అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత
ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్
ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని
పిల్మ్ నగర్ టాక్. ఇక
ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని,
లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో
చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో
ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన
బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.
తాతగా,
తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో
ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు
జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
చరణ్రాజ్, ఎమ్మెస్నారాయణ,
వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.
0 comments:
Post a Comment