నేను
పోషించిన సీత పాత్ర నాకు
గౌరవాన్ని పెంచింది. అందుకే ఆ పాత్ర నాకు
రావడానికి కారకులైన బాపు, బాలకృష్ణగార్లకు థాంక్స్
చెప్పుకుంటున్నాను అంది నయనతార. ఆమె
రీసెంట్ గా ఓ ప్రెవేట్
పంక్షన్ కి వచ్చినప్పుడు మీడియాతో
మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఇకపై
సెక్సీ ఇమేజ్ ఉన్న పాత్రలు
చేయదలచుకోలేదని, ఆ ఇమేజ్ నుంచి
బయిటపడాలనుకుంటున్నట్లు చెప్పింది.
ఆమె మాట్లాడుతూ...నాలో ఈ మార్పు
రావటానికి కారణం ‘శ్రీరామరాజ్యం' చిత్రం.అందులో అంతమంచి పాత్ర చేసిన తర్వాత
మళ్లీ మునుపటి ఇమేజ్ కోసం పాకులాడటం
కరెక్ట్ కాదని అనిపించింది. ‘డర్టీ
పిక్చర్' రీమేక్లో నటించడానికి రెండు
కోట్లు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నా, కేవలం గత ఇమేజ్ని కోరుకోవడం లేదు
కాబట్టే ‘ఓకే' చెప్పలేకపోయాను.పాత్ర
గౌరవంగా ఉంటేనే ఇక నుంచి నటించాలని
నిర్ణయించుకున్నాను అన్నారామె.
ప్రస్తుతం
క్రిష్ దర్శకత్వంలో ‘కృష్ణంవందే జగద్గురుమ్'లో నటిస్తున్నాను. అందులో
నా పాత్ర పేరు దేవిక.
జర్నలిస్ట్ని. కథలో నా
పాత్ర చాలా కీలకం. ఇంకా
గోపీచంద్తో ‘జగన్మోహన్ ఐపీఎస్'
చేస్తున్నాను. ఇందులో కూడా మంచి పాత్ర.
ఇంకా నాగార్జునగారితో ఓ సినిమా, తమిళంలో
రెండు సినిమాలు చేయాల్సివుంది అని చెప్పుకొచ్చింది.
మణిరత్నం
తాజా చిత్రం లో నయనతార ని
తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆమెకు ప్రస్తుతం తాను
డైరక్ట్ చేస్తున్న కడల్ చిత్రంలో ఓ
ప్రత్యేక పాత్రను ఆఫర్ చేసారని,ఆమె
వెంటనే ఓకే చేసిందని చెప్తున్నారు.
స్క్రిప్టు,తన పాత్ర ఏమిటి
అని అడగకుండా మరీ మణిరత్నం చిత్రాన్ని
ఆమె ఒప్పుకుందని చెన్నై వర్గాలు చెప్తున్నారు. నయనతారకు ఎప్పటినుంచో మణిరత్నం దర్శకత్వంలో చేయాలనే కోరిక అని..అది
ఈ విధంగా తీరనుందని ఆమె శ్రేయాభిలాషులు అంటున్నారు.
0 comments:
Post a Comment