
ప్రేమ,
సహజీవనం, ఓ బిడ్డకు తల్లిదండ్రులు
అయిన తర్వాత పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్-రేణుదేశాయ్
లపై కొన్ని రోజుల క్రితం విడాకుల
రూమర్లు షికారు చేసిన విషయం తెలిసిందే.
ఆ రూమర్లు రావడానికి కారణం రేణు దేశాయ్
తన ఇద్దరు పిల్లలు అకీరానందన్, ఆదియాలతో కలిసి పూణె చెక్కేయడమే.
అయితే చరణ్ పెళ్లిలో పవన్,
రేణు కలిసి కనిపించడంతో అభిమానుల్లోనూ
అనుమానాలు నివృత్తి అయ్యాయి.
తాము
విడిపోయామనే వార్తల విషయం తెలుసుకున్న రేణు
దేశాయ్ తీవ్రంగా స్పందించారు. అదంతా అసత్య ప్రచారంగా
కొట్టిపారేసారు. ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో? ఎవరు
పుట్టిస్తారో అంటూ మండి పడ్డారు.
ఈ వార్తలు విన్న వెంటనే షాకయ్యానంటూ
వ్యాఖ్యానించారు.
మా మధ్య 11 ఏళ్ల ప్రేమ బంధం
ఉంది. ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాం
అని స్పష్టం చేసారు రేణు. మీరు పిల్లలను
తీసుకుని పూణె ఎందుకు వెళ్లారని
ప్రశ్నించగా....అకీరా ఎడ్యుకేషన్ కోసమే
అక్కడికి వెళ్లాం. పవన్ మా పిల్లలను
గ్లామర్ ప్రపంచానికి దూరంగా పెంచాలని ఆకాంక్షించారు. అందుకే పూణె వెళ్లాం. ఆయనకు
షూటింగులు అయిపోగానే అక్కడికి వస్తుంటారు అని రేణు వివరణ
ఇచ్చింది.
హైదరాబాద్లో ఉండటం వల్ల
పరిస్థితులు వేరేలా ఉంటాయి. అందుకే పవనే ఈ నిర్ణయం
తీసుకున్నారని రేణు వెల్లడించారు. ప్రస్తుతం
అకీరా వాళ్ల నాన్నతో కలిసి
సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురును చూసుకోవడం
కోసం తాను ఇన్నాళ్లు పూణెలోనే
ఉండిపోయాను అని చెప్పింది.
0 comments:
Post a Comment