యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రెబెల్’ చిత్రం నైజాం రైట్స్ కోసం
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ
మొత్తం చెల్లించారు. ప్రభాస్కు సంబంధించిన వెబ్
సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన ఈ చిత్రం
నైజాం హక్కులను రూ. 9.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే
రెబల్ చిత్రానికి ఈ రేంజ్లో
రేటు పలకడం ఇదే తొలి
సారి.
రాఘవ
లారెన్స్ ఈ చిత్రానికి రద్శకత్వం
హించడంతో పాట సంగీతం, కొరియోగ్రఫీ
బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. జూన్
నెలలో ఆడియో విడుదల చేసి
జులై మొదటి వారంలో సినిమాను
విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా
గతంలో కృష్ణంరాజు, బాపు కాంబినేషన్ లో
వచ్చిన బుల్లెట్ చిత్రానికి కాపీ అంటూ ఓ
రూమర్ ఇప్పుడు నెట్ సర్కిల్సో హల్
చల్ చేస్తోంది. అప్పట్లో ఆ సినిమా డిజాస్టర్
అయ్యింది. అయితే అదే కథని
ఈ కాలానికి తగినట్లు కొద్దిగా మార్చి ప్రబాస్ చేస్తున్నాడని అంటున్నారు.
ఈ చిత్రం చాలా కాలం క్రితం
ప్రారంబమై ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే అసలు
విడుదల లేటవటానికి కారణం ఏమిటీ అంటే..తమన్నా డేట్స్ అని చెప్తున్నారు. అనూష్కని
కాదనుకుని తమన్నాని తీసుకున్నాక ఆమె డేట్స్ ఎడ్జెస్టు
చెయ్యలేకపోయింది. ఆమె ఈ చిత్రం
ఒప్పుకునే సరికే రచ్చ, ఎందుకంటే
ప్రేమంట చిత్రాలు కమిటైంది. దాంతో ఆమె డేట్స్
కు తగినట్లు ప్రభాస్ డేట్స్ ఎడ్జెస్ట్ చెయ్యాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ చిత్రంకోసం ఆమె
రెగ్యులర్ డేట్స్ ఇవ్వకుండా జంపింగ్ క్రింద డేట్స్ ఇచ్చింది.
తమన్నా,
దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ
చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. వేసవిలో 'రెబల్'ను ప్రేక్షకుల ముందుకు
తీసుకొస్తాం. ప్రభాస్ కెరీర్లోనే ‘రెబల్’ హై బడ్జెట్ ఫిలిం
అవుతుంది.షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరిందని నిర్మాతలు
చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:
తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు:
‘డార్లింగ్’స్వామి,
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం:
బాలాజీ సినీ మీడియా.
0 comments:
Post a Comment