ఎన్టీఆర్
తాజా చిత్రం బాద్షాలో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారని వార్తలు
వినపడుతున్నాయి. ఇటలీకి ఓ సీక్రెట్ మిషన్
నిమిత్తం వెళతాడని అక్కడ నుంచి కథ
ఓ చిత్రమైన మలుపు తిరుగుతుందని తెలుస్తోంది.
శ్రీను వైట్ల తరహా కామిడీకి
జేమ్స్ బాండ్ తరహా యాక్షన్
కలిపి ఈ చిత్రాన్ని రెడీ
చేయనున్నారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంపై
ఎన్టీఆర్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.
ఆయన ఈ చిత్రం పూర్తిగా
నవ్వులు పంచుతుందని హామీ ఇస్తున్నారు.
తొలి
షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల
పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడే రెండు పాటలు కాజల్,
ఎన్టీఆర్ మధ్యన తీయనున్నారు. అలాగే
ఎమ్.ఎస్ నారాయణ, కాజల్,
వెన్నెల కిషోర్, ఎన్టీఆర్ మధ్యన కొన్ని ఎంటర్టైన్మెంట్
సీన్స్ ని తీస్తున్నారు. అంతేకాకుండా
దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం
కీ రోల్ ప్లే చేస్తున్నారు.
ఇక ఈ విషయమై స్క్రిప్టు
రైటర్ కోన వెంకట్ తన
ట్విట్టర్ పేజీలో... ఈ సినిమాలో ఎన్టీఆర్
బ్రాండ్ న్యూ అవతార్ లో
కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు
అన్నారు. ఇక అందుకోసం ప్రత్యేకంగా
ముంబై నుంచి మేకప్ స్పెషలిస్టులు
వచ్చి మరీ ఎన్టీఆర్ ని
ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన ఫోషో సెసన్స్ కూడా
నడిచాయి. దాంతో ఆ క్యూరియాసిటీ
పోకుండా ఫస్ట్ లుక్ వదిలేవరకూ
ఎన్టీఆర్ పబ్లిక్ లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు
సమాచారం.
ఎన్టీఆర్
సైతం ఈ చిత్రంపై చాలా
నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...
సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు.
శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు
అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ, కథనం ఉంటాయి.
పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట
పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్
హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్
హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి
హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ
నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.
0 comments:
Post a Comment