పవన్
కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామేన్
గంగతో రాంబాబు'ని పూరీ జగన్నాధ్
డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం విషయంలో పవన్ స్ట్రిక్టుగా పూరీ
కి కండీషన్స్ పెట్టాడని వినికిడి. ముఖ్యంగా పూరి జగన్నాధ్ రెగ్యులర్
సినిమాల్లో ఉండే వల్గారిటి డైలాగులు,హీరోయిన్స్ ఎక్సపోజింగ్ ఈ చిత్రంలో కుదరదని
ముందే చెప్పినట్లు సమాచారం. తన స్టైల్ ప్రకారం
సీన్స్ చేయలే కానీ పూరీ
రెగ్యులర్ హీరో క్యారెక్టరైజేషన్ ని
తనపై రుద్దకూడదని చెప్పినట్లు చెప్తున్నారు.
ఇక సెట్స్ పైన కూడా డైలాగుల్లో
చాలా మార్పులు చేయిస్తున్నాడని,ఎక్కడా అశ్లీలం ద్వనించినా వెంటనే తీసేయిస్తున్నాడని,తన సినిమాలలో అవి
ఉండకూడదని ఖచ్చితంగా చెప్పి ఎడిట్ చేయిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
దాంతో పూరీ కి కొంత
ఇబ్బంది ఎదురైనా తప్పటం లేదని అంటున్నారు. అలాగే
అలీ కామెడీ ట్రాక్ కూడా వల్గారిటీ లేకుండా
చూడమని మరీ మరీ చెప్పినట్లు
సమాచారం.
తొలి
కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన
పవన్కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి'
తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా
చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి
కాంబినేషన్లో వస్తున్న చిత్రం
‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్సింగ్' లాంటి సూపర్ హిట్
తర్వాత పవన్కళ్యాణ్ నటిస్తున్న
సినిమా ఇదే కావటంతో మరింత
క్రేజ్ వచ్చింది.
ఇందులో
పవర్స్టార్ జర్నలిస్ట్గా నటిస్తున్నారు. నేటి
రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ
చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా
ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి
సినిమా కూడా ఇదే. అక్టోబర్
18న గ్రాండ్గా ఈ చిత్రాన్ని
విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.
ఇక ఈ చిత్రానికి పనిచేసే
నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు
బ్యానర్
: యూనివర్సల్ మీడియా
నటీనటులు:పవన్ కళ్యాణ్,కాజల్
అగర్వాల్,ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ,
ఎం.ఎస్.నారాయణ, కోట
శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం:
దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ:
శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్
డిజైనర్: చిన్నా
ఎడిటింగ్:
ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్:
విజయ్
నిర్మాత:
డివివి దానయ్య
సమర్పణ:
సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం:
పూరి జగన్నాథ్.
0 comments:
Post a Comment