హైదరాబాద్: తన భార్యతో అక్రమ సంబంధం ఉండటం వల్లనే తన కేసులో గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఓ భర్త రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఆధారాలు సమర్పించినట్లు పెద్ద ఎత్తున వార్తా ఛానెళ్లలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. విషయానికి వస్తే గుంటూరు జిల్లాకు చెందిన అర్బన్ ఎస్పీ అక్రమ సంబంధం వివాదంలో కూరుకు పోయారు. కార్తీక్, గోపికృష్ణ 1999లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.
ఆ తర్వాత భార్య గోపికృష్ణ భర్త కార్తీక్ పైన వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత కార్తీక్ తనకు విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ దంపతుల కేసులో గుంటూరు జిల్లాకు చెందిన అర్బన్ ఎస్పీ శ్యాంసుందర్ ఓవరాక్షన్ చేశారని భర్త కార్తీక్ ఆరోపిస్తున్నారు. తన భార్య గోపికృష్ణతో అక్రమ సంబంధం ఉండటం వల్లనే ఆయన ఈ కేసులో ప్రత్యక శ్రద్ధ చూపిస్తున్నారని భర్త ఆరోపించాడు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్తీక్ హైకోర్టులో సమర్పించాడు. జనవరి 2వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు గోపి ప్రియకు ఎస్పీ నుండి 221 ఫోన్ కాల్స్ వెళ్లాయి. అలాగే గోపి ప్రియ నుంచి ఎస్పీకి 175 కాల్స్ వచ్చాయి. తన భార్యతో అక్రమ సంబంధం కారణంగా ఎస్పీ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని, అతని పరిధి నుంచి 498ఏ కేసు తప్పించాలని భర్త హైకోర్టును కోరారు.
అర్ధరాత్రి ఎస్పీ తన భార్యకు ఫోన్ చేయడంపై భర్త కార్తీక్ విస్మయం వ్యక్తం చేశారు. గంటల కొద్ది మాట్లాడారని ఆయన కోర్టుకు విన్నవించారు. కేసులో భాగంగా ఇన్నిసార్లు ఫోన్ చేసి, అర్ధరాత్రి, అపరాత్రి ఫోన్లు చేయడం ఏ కేసులో భాగమని కార్తీక్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ పూర్తి ఆధారాలను కోర్టుకు భర్త సమర్పించారు. కాగా ఈ విషయంపై ఎస్పీ ఇంకా స్పందించలేదు.
0 comments:
Post a Comment