మాస్
మహరాజ రవితేజ నటించిన ‘దరువు’ చిత్రం రేపు(మే 25) విడుదల
కాబోతోంది. శివ(శౌర్యం ఫేం)
దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర
ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్
గా నటించింది.
రవితేజ
సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ
అనే నమ్మకంతో ఉంటారు నిర్మాతలు. అయితే రవితేజ గత
సినిమా ‘నిప్పు’ ప్లాపైన నేపథ్యంలో.....‘దరువు’ చిత్రం ద్వారా రవితేజ బాక్సాఫీసు వద్ద ఏమేరకు సత్తా
చాటుతాడనేది చర్చనీయాంశం అయింది. మార్కెట్లో గబ్బర్ సింగ్ ప్రభంజనం కొనసాగుతుండటం
కూడా రవితేజ సత్తాకు పరీక్ష లాంటిదే.
ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని
విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్
గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ
ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు
అల్లరి చిల్లర రౌడీ క్యారెక్టర్లతో కామెడీ
హీరోగా కనిపించిన రవితేజ ఈ సినిమాలో తనలోని
అసలైన నటుడిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా రవితేజ ఈచిత్రంలో చేసే పొలిటికల్ క్యారెక్టర్
సినిమాకే హైలెట్గా నిలవనుంది.
ఈ చిత్రంలో యమలోకంలో సంబంధం ఉన్న సీన్లు కూడా
ఉండబోతున్నాయి. తమిళ నటుడు ప్రభు
యమధర్మ రాజుగా కనిపించబోతున్నాడు. పూర్తి వినోదాత్మకంగా యమలోకం ఎపిసోడ్ సాగనుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో విద్యాబాలన్
పాత్రలో కడుపుబ్బా నవ్వించనున్నాడు.
రవితేజ
క్యారెక్టర్ విషయానికొస్తే..అతను పక్కా మాస్.
మనిషి మాస్క్ వేసుకున్న ట్రాన్స్ఫార్మర్లాగా పూర్తి ఎనర్జీతో
ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. అలాగే కొంచెం యాక్షన్కి, ఇంకొంచెం సున్నితమైన
భావోద్వేగాలకూ చోటుంటుంది.
బ్రహ్మానందం,
సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ
చిత్రానికి కథ, స్క్రీన్ప్లే:
శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా:
వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.
0 comments:
Post a Comment